కర్నూలు: టీవీ9 సీఈఓ, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్ పై మాజీ విలేకరి శుక్రవారం దాడి చేశారు. వరదబాధితుల కోసం నిర్మించిన టీవీ9 ప్రజానగర్ ఫేజ్ టూలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా రవి ప్రకాశ్ ను రమణ అనే విలేకరి చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన అనంతరం రమణపై సిబ్బంది దాడికి దిగారు. అయితే రమణపై జరిగిన దాడిని పోలీసులు అడ్డుకున్నారు. రవిప్రకాశ్ పై దాడికి కారణాలేమి ఇంకా తెలియరాలేదు. రవి ప్రకాశ్ పై దాడిని పలువురు జర్నలిస్టులు ఖండించారు. దాడి చేసిన రమణను కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారించారు.
For job news
ReplyDeletevisit:
www.india100jobs.blogspot.in